kcr: సోషల్ మీడియా ద్వారా సమస్య తెలిపిన యువకుడు.. వెంటనే స్పందించిన కేసీఆర్

  • తమ భూ సమస్యను కేసీఆర్ కు పంపిన యువకుడు
  • స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీఎం
  • సమస్యను పరిష్కరించాలంటూ కలెక్టర్ కు ఆదేశాలు

ఓ యువకుడి సమస్య పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించారు. మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలంలో శరత్ అనే యువకుడు తమ కుటుంబం ఎదుర్కొంటున్న భూ సమస్యను వీడియో రూపంలో సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆ వీడియోను చూసిన వెంటనే కేసీఆర్ స్పందించారు. శరత్ కుటుంబంతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు వెళ్లాయి. ఈ సందర్భంగా కలెక్టర్ హోలికేరి భారతి మాట్లాడుతూ, ఆ కుటుంబాన్ని పరామర్శించి, న్యాయం చేస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News