akhilapriya: రాళ్లదాడిలో భూమా అఖిలప్రియ భర్త, చెల్లికి గాయాలు

  • ఆళ్లగడ్డ జిల్లా అహోబిలంలో భూమా, గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ
  • రాళ్లు రువ్వుకున్న వైనం
  • హుటాహుటిన అహోబిలం చేరుకున్న అఖిలప్రియ

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ సందర్భంగా అహోబిలంలో భూమా, గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గీయులు సరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ రాళ్ల దాడిలో మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్, ఆమె చెల్లెలు మోనికకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘర్షణ నేపథ్యంలో, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. సమాచారం అందుకున్న అఖిలప్రియ హుటాహుటిన అహోబిలం చేరుకున్నారు.

  • Loading...

More Telugu News