sri lanka: శ్రీలంకలో ఉగ్రదాడులకు పాల్పడింది మేమే!: ఐసిస్ ప్రకటన

  • కొలంబోలో ఈస్టర్ పండగ రోజు విషాద ఘటన
  • చర్చిలు, స్టార్ హోటల్స్ లో బాంబు పేలుళ్లు మా పనే
  • అమాక్ న్యూస్ ఏజెన్సీ ప్రకటన

ఈస్టర్ పండగ రోజున శ్రీలంక రాజధాని కొలంబో బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన విషాద ఘటన తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్  ప్రకటించింది. ఈ మేరకు ఐసిస్ కు చెందిన అమాక్ న్యూస్ ఏజెన్సీ ఓ ప్రకటన చేసింది. కొలంబోలోని మూడు చర్చిలు, మూడు స్టార్ హోటల్స్ లో బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని పేర్కొంది. కాగా, కొలంబోలో పలుచోట్ల సంభవించిన పేలుళ్లలో 310 మంది వరకు మృతి చెందారు. ఐదు వందల మందికి పైగా గాయపడ్డారు.

  • Loading...

More Telugu News