Prattipati: తాను వైసీపీలో చేరనున్నట్టు వచ్చిన వార్తలపై స్పందించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు!

  • సోషల్ మీడియా వార్తలు నిరాధారం
  • తెలుగుదేశంలోనే కొనసాగుతాను
  • ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానన్న ప్రత్తిపాటి

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఉదయం ఆయన స్పందించారు. ఈ ఉదయం గుంటూరులో మాట్లాడిన ఆయన, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అసత్యమని, నిరాధారమని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా, ఎలాంటి కష్టం ఎదురైనా తనను సంప్రదించాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News