Vijayawada: అటూ ఇటూ కానోళ్లకి బెజవాడలో చాలా పేర్లున్నాయి: పీవీపీ

  • విజయవాడ నేతల మధ్య ట్వీట్ల వార్
  • కొత్త నిక్కర్ కుట్టించాలంటే మీటర్లు కావాలని పీవీపీ సెటైర్
  • పార్టీ మారుతున్న వారు టార్గెట్ గా వ్యంగ్యాస్త్రాలు

విజయవాడ రాజకీయ నేతల మధ్య ట్విట్టర్ వేదికగా జరుగుతున్న మాటల యుద్ధం మరింతగా పెరిగింది. కేశినేని నాని, బుద్ధా వెంకన్నలతో పాటు రెండు రోజుల నుంచి వైసీపీ నేత పీవీపీ వరప్రసాద్ కూడా వచ్చి చేశారు. ఈ ఉదయం ఆయన పార్టీ మారిన వారిని ఉద్దేశించి ఓ ట్వీట్ పెట్టారు. ఎవరిని ఉద్దేశించి విమర్శిస్తున్నానన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.

"ముందు నీది పసుపు నిక్కరో, ఖాకి నిక్కరో తేల్చుకోవయ్యా సామి. సక్రమ సంబంధమో లేక  అక్రమ సంబంధమో ప్రజలే తేలుస్తారు. అటు ఇటు కానోళ్ళని  మన బెజవాడలో చాలా పేర్లతో పిలుస్తారు. ఆటోనగర్ వెళ్లి అడిగితే చాలా క్లియర్ గా చెపుతారు" అని అన్నారు. ఆపై "బై ది వే, ప్రతి సారి  కొత్త నిక్కర్ కుట్టించాలన్నా,‌ మీటర్లు మీటర్లు గుడ్డ అవసరమాయే! అసలే కరువు కాలం" అని మరో ట్వీట్ పెట్టారు. 

  • Loading...

More Telugu News