Telangana: తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు ఆదేశాలు

  • ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ
  • రేపు ఉదయం జైపాల్ రెడ్డి అంతిమయాత్ర
  • ప్రజల సందర్శనార్థం రేపు గాంధీభవన్ లో జైపాల్ పార్థివదేహం 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ జోషికి ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ లోని జైపాల్ రెడ్డి నివాసం నుంచి అంతిమయాత్ర నిర్వహించనున్నారు. జైపాల్ రెడ్డి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్ధం గాంధీభవన్ లో రేపు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఉంచనున్నారు.

  • Loading...

More Telugu News