Andhra Pradesh: ఏపీ సీఎం కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ బలోపేతానికి ప్రభుత్వ ఆదేశాలు

  • ప్రజా ఫిర్యాదులను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ 
  • ఈ సెల్ కు 13 మంది సిబ్బంది కేటాయింపు
  • ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు

ఏపీ సీఎం కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ను బలోపేతం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ఫిర్యాదులను పరిష్కరించే నిమిత్తం ఈ సెల్ ను పటిష్టపరిచిన ప్రభుత్వం, పదమూడు మంది సిబ్బందిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, విజయవాడలోని ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నారు.  

  • Loading...

More Telugu News