Dhruv: 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ విడుదల తేదీ ఖరారు

  • హీరోగా ధృవ్ తొలి పరిచయం 
  • సెప్టెంబర్ 27న విడుదల 
  • హిట్ కొట్టాలంటోన్న విక్రమ్ ఫ్యాన్స్

తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా చేసిన 'అర్జున్ రెడ్డి' సంచలన విజయాన్ని సాధించింది. ఇదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేయగా అక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తమిళ రీమేక్ రిలీజ్ కి సిద్ధమవుతోంది.

విక్రమ్ తనయుడు 'ధృవ్' హీరోగా తమిళంలో ఈ సినిమా 'ఆదిత్య వర్మ' పేరుతో నిర్మితమైంది. సందీప్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన గిరీశాయ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. కథలో ఎలాంటి మార్పులు చేయకుండా సీన్ టు సీన్ రీమేక్ చేయించినట్టుగా చెప్పుకుంటున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ధృవ్ కి ఇది తొలి సినిమా కావడంతో, భారీ హిట్ పడాలని విక్రమ్ అభిమానులంతా ఆశిస్తున్నారు. 

  • Loading...

More Telugu News