Nalgonda District: కన్నబిడ్డ పీక కొరికి.. గొంతు నులిమి చంపేసిన తండ్రి!

  • అత్యంత కర్కశంగా హత్య
  • దంపతుల మధ్య విభేదాలకు చిన్నారి బలి
  • నల్గొండ జిల్లా తిర్మరాయినిగూడెంలో ఘటన

భార్యతో విభేదాల నేపథ్యంలో కొడుకు ఆమెకు దక్కకూడదన్న ఉద్దేశంతో ఉన్మాదిలా మారిన ఓ తండ్రి నాలుగేళ్ల కన్నబిడ్డను పీకకొరికి, గొంతునులిమి కర్కశంగా హత్యచేసిన దారుణ ఘటన ఇది. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం తిర్మరాయినిగూడెంలో చోటుచేసుకున్న ఈ విషాదంపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన చింతల కనకయ్య, స్వప్న దంపతులకు కూతురు అక్షిత (6), కొడుకు అక్షయ్‌ (4) ఉన్నారు. బతుకుదెరువు కోసం కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చి నివాసం ఉంటున్నారు. నెలరోజుల క్రితం దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో కొడుకును తీసుకుని కన్నయ్య సొంతూరిలోని పెదనాన్న చింతల రాములు ఇంటికి వచ్చేశాడు. కూలిపనులు చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు.

ఈ నేపథ్యంలో అక్షయ్‌ బాగోగులు చూడడానికి ఇబ్బందిగా ఉందని, వచ్చి తీసుకువెళ్లాలని రాములు కుటుంబ సభ్యులు స్వప్నకు సమాచారం అందించారు. దీంతో రెండు మూడు రోజుల్లో వచ్చి బిడ్డను తనతోపాటు తీసుకువెళ్తానని ఆమె తెలియజేసింది. కొడుకును భార్య తీసుకువెళ్తుందన్న సమాచారం కన్నయ్యకు తెలిసి రగిలిపోయాడు. గురువారం రాత్రి బోనాల పండుగ కావడంతో రాత్రి పూటుగా మద్యం సేవించాడు. ఆ మత్తులో ఉన్మాదిలా మారిపోయాడు.

అర్ధరాత్రి పక్కనే పడుకున్న కొడుకు గొంతు నులిమాడు. పీకతోపాటు మరికొన్నిచోట్ల కొరికి గాయపరిచాడు. పిన్‌ తీసుకుని ఇష్టానుసారం మెడపై పొడిచాడు. తర్వాత గొంతు నులిమి చంపేశాడు. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. భార్యకు బిడ్డ దక్కకూడదన్న ఉన్మాదంతోనే కన్నయ్య ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News