YSRCP: టీడీపీపై దాడులంటూ దుష్ప్రచారం తగదు: మంత్రి శంకర్ నారాయణ

  • టీడీపీ హింసా రాజకీయాలు చేస్తోంది
  • వైఎస్సార్ సీపీపై బురద జల్లడం మానుకోవాలి
  • ‘అనంత’లో పరిటాల సునీత ఆగడాలు మితిమీరిపోయాయి

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై మంత్రి శంకర్ నారాయణ విమర్శలు చేశారు. అనంతపురంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, టీడీపీపై దాడులు జరుగుతున్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబుకు పునరావాస కేంద్రం కావాలని అన్నారు. టీడీపీ ఓ వైపు హింసా రాజకీయాలు చేస్తూ, మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పై బురద జల్లడం మానుకోవాలని హితవు పలికారు. సీఎం జగన్ వంద రోజుల పాలన చూసి, అమలవుతున్న సంక్షేమ పథకాల తీరు చూసి, టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీతపై ఆరోపణలు గుప్పించారు. అనంతపురం జిల్లాలో పరిటాల సునీత ఆగడాలు మితిమీరిపోయాయని అన్నారు.

  • Loading...

More Telugu News