Undavalli: హైకోర్టును ఆశ్రయించిన లింగమనేని రమేశ్

  • కరకట్టపై అక్రమ కట్టడాలకు సీఆర్డీఏ నోటీసులు
  • సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేసిన లింగమనేని
  • వివరణ తీసుకోకుండా కూల్చేస్తామనడం కరెక్టు కాదంటూ వాదన 

ఉండవల్లి కరకట్టపై అక్రమ కట్టడాలకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై లింగమనేని రమేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తమ వివరణలు, పత్రాలు తీసుకోకుండా కూల్చేస్తామనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది. కాగా, కృష్ణా నది కరకట్ట వెంబడి ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ కు ఒక్క అనుమతి కూడా లేదని వైసీపీ నేత ఆర్కే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News