Sonakshi Sinha: సోనాక్షి ఓ డబ్బు పశువు: యూపీ మంత్రి ఫైర్

  • ఇలాంటి వారు డబ్బు కోసమే ఆలోచిస్తారు
  • మంచి విషయాలను నేర్చుకోరు
  • మన చరిత్ర, దేవుళ్ల గురించి తెలుసుకోరు

'కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమం బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమంలో అతిథిగా సోనాక్షి పాల్గొంది. ఈ సందర్భంగా 'హనుమంతుడు సంజీవనిని ఎవరి కోసం తీసుకొచ్చారు?' అనే ప్రశ్న ఎదురైంది.

అయితే, ఈ ప్రశ్నకు సోనాక్షి సమాధానం చెప్పలేకపోయింది. లైఫ్ లైన్ తీసుకుంది. దీంతో, సోనాక్షిపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్ మంత్రి సునీల్ భరాలా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇలాంటి వారు డబ్బు కోసమే ఆలోచిస్తారని... మంచి విషయాలను నేర్చుకోరని మండిపడ్డారు. సోనాక్షి ఓ డబ్బు పశువని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన చరిత్ర, దేవుళ్ల గురించి కూడా తెలుసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News