Ashok Singhal: ఈ ఘనత అశోక్ సింఘాల్ దే... ఆయనకు కేంద్రం 'భారతరత్న' ఇవ్వాలి: 'అయోధ్య' తీర్పుపై సుబ్రహ్మణ్యస్వామి స్పందన

  • అయోధ్య భూమిపై సుప్రీం తీర్పు
  • హర్షం వ్యక్తం చేసిన సుబ్రహ్మణ్యస్వామి
  • చారిత్రక విజయంగా అభివర్ణన
ఇప్పటివరకు ఎంతో సమస్యాత్మకమైన వివాదంగా ప్రసిద్ధికెక్కిన అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పు ప్రకటించింది. దీనిపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. ఇది చారిత్రక విజయం అని పేర్కొన్న ఆయన, ఈ విజయాన్ని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) దివంగత నేత అశోక్ సింఘాల్ కు ఆపాదించారు. ఈ చిరస్మరణీయ ఘడియల్లో అశోక్ సింఘాల్ ను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని, ఆయనకు మోదీ సర్కారు వెంటనే 'భారతరత్న' ప్రకటించాలని కోరారు.

దశాబ్దాల కిందట అయోధ్య భూవివాదం ఉత్పన్నమైనప్పుడు అశోక్ సింఘాల్ ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఓ ఉద్యమం సాగించినంత తీవ్రతతో అయోధ్య అంశాన్ని జాతీయస్థాయికి చేర్చారు. దేశంలోనే అతిపెద్ద మతపరమైన, రాజకీయ అంశంగా నేడు అయోధ్య అంశం చర్చకు వస్తోందంటే అందుకు కారణం అశోక్ సింఘాల్ అన్నది సుస్పష్టం.
Ashok Singhal
Bharataratna
Subramanian Swamy
Ayodhya

More Telugu News