Amaravati: రేపు అమరావతి బంద్ కు పిలుపు నిచ్చిన రాజధాని రైతులు

  • మందడంలో మహిళలపై పోలీస్ దౌర్జన్యానికి నిరసన
  • శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఈడ్చుకెళతారా?
  • పోలీసులపై మండిపడుతున్న రైతులు

రాజధాని ప్రాంతం మందడంలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేశారంటూ అక్కడి రైతులు, మహిళలు మండిపడుతున్నారు. తమపై పోలీసులు దారుణంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రేపు రాజధాని అమరావతి బంద్ కు రైతులు పిలుపు నిచ్చారు.

మహిళలపై పోలీసుల ప్రతాపం దారుణం: నారా లోకేశ్

ఈ ఘటనను టీడీపీ నేత నారా లోకేశ్ ఖండించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళలపై పోలీసులు తమ ప్రతాపం చూపడం దారుణమని అన్నారు. సీఎం జగన్ ని ‘మాట తప్పకండి, మడమ తిప్పకండి’ అని అడగడం తప్పా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News