Nirmala Sitharaman: 'బడ్జెట్ రోజున మార్కెట్ల పతనం ఎందుకు?'... అవాక్కయ్యేలా సమాధానం ఇచ్చిన నిర్మలమ్మ!

  • శనివారం నాడు దాదాపు 1000 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • ఇన్వెస్టర్లు వీకెండ్ మూడ్ లో ఉన్నారంతే
  • సోమవారం లాభాలను గుర్తు చేసిన నిర్మలా సీతారామన్

ఈ నెల 1వ తేదీ, శనివారం నాడు లోక్ సభలో 2020-21 సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన వేళ, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించగా, బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక, దాదాపు 1000 పాయింట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ప్రతిపాదనల్లో మార్కెట్ వర్గాలను సంతృప్తిపరిచే నిర్ణయాలు లేకపోవడంతో ఇన్వెస్టర్ల అమ్మకాలవైపే మొగ్గు చూపారు.

ఇక తాజాగా, నిర్మలా సీతారామన్, ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని, ఆపై మీడియాతో మాట్లాడిన వేళ, మార్కెట్ భారీ పతనానికి కారణం ఏంటన్న ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనిపై స్పందించిన నిర్మలమ్మ, అందరూ అవాక్కయ్యే సమాధానం ఇచ్చారు. కేవలం వారాంతం కావడంతోనే మార్కెట్లు నష్టపోయాయని ఆమె అన్నారు.

బడ్జెట్ రోజున మార్కెట్ వర్గాలు సంతోషంగా లేకపోవడానికి కారణం వీకెండ్ మాత్రమేనని, సోమవారం నాడు మార్కెట్లు లాభాల్లో నడిచాయని ఆమె గుర్తు చేయడం గమనార్హం. వీకెండ్ మూడ్ లో ఉన్న మదుపరులు తమ వాటాలను అమ్ముకున్నారని, ఇప్పుడు వారంతా నిజమైన ట్రేడింగ్ మూడ్ లో ఉన్నారని నిర్మలమ్మ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News