Ram Janmabhoomi Trust: రేపు తొలిసారి భేటీ కానున్న అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్

First meeting of Ram Janmabhoomi Trust to take place in Delhi on Wednesday

  • ఢిల్లీలో రేపు సాయంత్రం 5 గంటలకు అయోధ్య ట్రస్ట్ సభ్యుల భేటీ
  • ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న ట్రస్ట్ సభ్యులు
  • రామ జన్మభూమి న్యాస్ అధిపతికి ప్రత్యేక ఆహ్వానం

అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు రేపు తొలిసారి భేటీకానుంది. ఢిల్లీలోని కె.పరాశరన్ నివాసంలో ఈ ట్రస్టు సభ్యులంతా భేటీకానున్నారు. సాయంత్రం 5 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ట్రస్టు సభ్యులంతా ఢిల్లీకి చేరుకున్నారు. రామ జన్మభూమి న్యాస్ అధిపతి మహంత్ నృత్యగోపాల్ దాస్ ను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. అయోధ్య రామాలయ నిర్మాణ పనులన్నీ ఈ ట్రస్టు ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. ఆలయ నిర్మాణానికి విరాళాలను స్వీకరించేందుకు ట్రస్ట్ పేరుతో ఒక బ్యాంక్ అకౌంట్ ను ప్రారంభించనున్నారు.

  • Loading...

More Telugu News