KCR: నేడు ట్రంప్​ కు రాష్ట్రపతి ప్రత్యేక విందు.. హాజరుకానున్న సీఎం కేసీఆర్​

Telangana CM Kcr goes to Delhi to partcipate Rastrapati special Dinner

  • రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేక విందుకు ఏర్పాట్లు
  • ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్న కేసీఆర్
  • ట్రంప్ దంపతులకు కానుకలు అందజేయనున్న సీఎం

భారత్ లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి ఈరోజు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన ఈ విందుకు కేంద్ర మంత్రులు, రాజకీయనేతలు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ విందుకు హాజరుకావాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం అందిన విషయం తెలిసిందే.

ఈ ఆహ్వానం మేరకు విందులో పాల్గొనేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారు. ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళతారని సమాచారం. ఈ సందర్భంగా ట్రంప్ దంపతులకు, కూతురు ఇవాంకకు కేసీఆర్ కానుకలు అందించనున్నట్టు సమాచారం. కాగా, రాష్ట్రపతి గౌరవార్థం ఇస్తున్న ఈ విందులో మొత్తం 90 నుంచి 95 మంది వీఐపీలు మాత్రమే పాల్గొంటారని తెలుస్తోంది. కేసీఆర్ సహా మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, అసోం, హర్యానా, బీహార్ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.

  • Loading...

More Telugu News