Jumbo Parantha: మూడు పరోటాలను 50 నిమిషాల్లో తింటే లక్ష రూపాయల ప్రైజ్!

Parantha eating competition at Hotel Tapasya in Haryana

  • హర్యానాలో పరోటాలకు పేరుగాంచిన హోటల్ తపస్య
  • ప్రత్యేకంగా జంబో పరోటాలు తయారీ
  • ఒక్కోటి రెండున్నర అడుగుల మేర ఉండే నేతి పరోటాలు
  • నిర్ణీత సమయంలో తిన్నవారికి నగదుతో పాటు జీవితాంతం ఫుడ్ ఫ్రీ

హర్యానాలోని రోహతక్ లో హోటల్ తపస్య అంటే పరోటాలకు చాలా ఫేమస్. అక్కడ 2006 నుంచి పరోటాల పోటీ నిర్వహిస్తున్నారు. 50 నిమిషాల్లో 3 పరోటాలు తింటే లక్ష రూపాయల బహుమతితో పాటు జీవితాంతం ఫ్రీగా భోజనం అందిస్తారు. ఆ... పరోటాలే కదా ఈజీగా లాగించేయొచ్చు అనుకోకండి! ఇవి జంబో పరోటాలు మరి! ఒక్కో పరోటా సైజు రెండున్నర అడుగుల మేర ఉంటుంది. ఆ పరోటా మధ్యలో రెండు కిలోల కుర్మా ఉంటుంది. ఆలూ మిక్స్, ఆనియన్, కాలీఫ్లవర్ కుర్మాలను ఈ పరోటాల్లో వినియోగిస్తారు.

సాధారణంగా ఒక్కో జంబో పరోటాను ఐదుగురు తింటారు. వీటి ధర రూ.300 నుంచి మొదలవుతాయి. నేతితో తయారయ్యే ఈ భారీ పరోటాలను తినేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. గత 14 ఏళ్లుగా ఈ పోటీలు జరుగుతున్నా ఇప్పటివరకు నెగ్గింది ఇద్దరంటే ఇద్దరేనట! పోటీల సంగతి ఎలా ఉన్నా తపస్య హోటల్లో తయారయ్యే పరోటాల రుచి ఇంకెక్కడా లభించదని కస్టమర్లు లొట్టలు వేస్తుంటారు.

  • Loading...

More Telugu News