Parimal Nathwani: సీఎం జగన్​ కు ధన్యవాదాలు తెలిపిన పరిమళ్​ నత్వానీ

Parmil Natwani thanks to CM Jagan

  • వైసీపీ నుంచి రాజ్యసభ సీటు పొందిన పరిమళ్ నత్వాని
  • జగన్ కు, వైసీపీకి ధన్యవాదాలు
  • ఏపీ అభివృద్ధికి పాటుపడతా.. ట్విట్టర్ వేదికగా నత్వానీ స్పందన

ఏపీ నుంచి తమ పార్టీ తరఫున నలుగురు రాజ్యసభ అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఆ నలుగురిలో పరిమళ్ నత్వానీ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కు, వైసీపీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీ రాష్ట్రాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నానంటూ ఓ పోస్ట్ చేశారు.

కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యాపారవేత్త పరిమళ్ నత్వానీ. ‘రిలయన్స్’లో నత్వానీ కీలక వ్యక్తి. బీజేపీ నేతలతో కీలక సంబంధాలు ఉన్న నత్వానీ, ఇప్పటికే రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News