Amaravati: పేదల ఇళ్ల పట్టాల పంపిణీ జీవోకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్​పై తీర్పు రిజర్వ్​

 Reserve judgment on petition for distribution of title deeds to poor in capital area

  • రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ  జీవో చట్ట విరుద్ధం
  • ఆ ప్రాంతంలో రిజర్వ్ చేసిన 5 శాతం భూముల్లోనే ఇళ్లు నిర్మించాలి
  • పేదలకు నివాస స్థలాలు కేటాయించాలని చట్టంలో  లేదు: పిటిషనర్ తరఫు న్యాయవాది

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ లో ఉంచుతున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది. రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీకి జీవో జారీ చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. రాజధాని ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన పేదలకు సీఆర్డీఏ చట్టం ప్రకారం ఆ ప్రాంతంలో రిజర్వ్ చేసిన ఐదు శాతం భూముల్లోనే ఇళ్లు నిర్మించాలని అన్నారు. పేదలకు నివాస స్థలాలు కేటాయించాలని చట్టంలో ఎక్కడా లేదని, కేవలం, నివాసయోగ్యమైన ఇల్లు మాత్రమే ఇవ్వాలని ఉందని న్యాయస్థానం ఎదుట తమ వాదనలు వినిపించారు.

  • Loading...

More Telugu News