Pawan Kalyan: ప్రధాని సహాయ నిధికి పవన్‌ కల్యాణ్‌ రూ.కోటి విరాళం

pawankalyan donate one crore for PM releif fund

  • కరోనాపై పోరాటానికి సాయమని వెల్లడి
  • ప్రధాని తీసుకుంటున్న చర్యలు అభినందనీయం
  • ఆయనకు బాసటగా నిలవాలని ఈ నిర్ణయం

జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ ప్రధాని సహాయ నిధికి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో తనవంతు భాగస్వామ్యం కోసం ఈ నిధులు అందజేస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఆంధ్రా, తెలంగాణా ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించిన పవన్‌ కల్యాణ్ కాసేపటికే ప్రధాని సహాయ నిధికి కూడా రూ.కోటి విరాళం ప్రకటించారు. ‘ఈ కష్టకాలంలో ప్రధాని మోదీకి బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆయన నాయకత్వం, స్ఫూర్తిదాయక చర్యలు ఈ కష్టం నుంచి దేశాన్ని గట్టెక్కించగలవని నమ్ముతున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు.

  • Loading...

More Telugu News