Kesineni Nani: కొత్త ఎస్ఈసీని తీసుకువచ్చినట్టే ఇతర రాష్ట్రాల నుంచి మనవాళ్లను తీసుకువరావచ్చు కదా?: కేశినేని నాని

Kesineni Nani responds on new SEC appointment

  • నిమ్మగడ్డ రమేశ్ స్థానంలో కనగరాజ్
  • ఏపీకి నూతన ఎస్ఈసీ
  • సీఎం జగన్ కు సూచన చేసిన కేశినేని నాని

ఏపీలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానంలో కొత్త ఎలక్షన్ కమిషనర్ గా కనగరాజ్ ను నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. కొత్తగా నియమితులైన ఎలక్షన్ కమిషనర్ ను తమిళనాడు నుంచి రాష్ట్రానికి తీసుకువచ్చినట్టే వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన మన రాష్ట్రాల వారిని కూడా తీసుకురావచ్చు కదా? అంటూ సీఎం జగన్ కు హితవు పలికారు. ప్రత్యేక ఆర్డినెన్స్ సాయంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తొలగించిన ఏపీ సర్కారు, ఆ పదవిలోకి మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి కనగరాజ్ ను తీసుకువచ్చింది. 

  • Loading...

More Telugu News