Lockdown: ఏప్రిల్ 20 నుంచి అందుబాటులోకి వచ్చే సేవలు ఇవే!

Here is What Will Remain Open Across India from Monday

  • దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పాక్షిక సడలింపు 
  • ఎల్లుండి నుంచి కొన్ని సేవలను అనుమతించాలని కేంద్రం నిర్ణయం
  • ఈ మేరకు తాజా మార్గదర్శకాల విడుదల

దేశంలో కరోనా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం రెండో దశ లాక్ డౌన్ ను మే 3 వరకు విధించినా, ఏప్రిల్ 20 నుంచి దశలవారీగా ఆంక్షలు సడలించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఎల్లుండి సోమవారం నుంచి అనేక సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్రం తాజా లాక్ డౌన్ మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఏప్రిల్ 20 నుంచి అందుబాటులోకి వచ్చే సేవల వివరాలు

  • ఆయుష్ సహా అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.
  • అన్ని రకాల వ్యవసాయ కార్యకలాపాలు, ఉద్యాన కార్యకలాపాలు (హార్టీకల్చర్) నిర్వహించుకోవచ్చు.
  • రొయ్యలు, చేపల పెంపంకం, ఆక్వారంగానికి చెందిన ఇతర కార్యకలాపాలపై ఆంక్షలు ఉండవు.
  • తేయాకు, కాఫీ, రబ్బరు తోటల్లో పనులు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు.
  • పశుసంవర్ధక కార్యకలాపాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.
  • ఆర్థిక రంగం, సామాజిక సేవల రంగంపై ఆంక్షల తొలగింపు
  • భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలన్న నిబంధనతో ఉపాధి హామీ పథకం కూలీలకు అనుమతి.
  • ప్రజా సౌకర్యాలపై తొలగిన ఆంక్షలు.
  •  రాష్ట్ర పరిధిలో, అంతర్రాష్ట్ర సరకు లోడింగ్, అన్ లోడింగ్ కు అనుమతి (రవాణా).
  • ఆన్ లైన్ బోధన, దూరవిద్య కార్యక్రమాలకు ప్రోత్సాహం.
  • నిత్యావసర సరుకులు, వస్తువుల రవాణాకు అనుమతి.
  • వాణిజ్య, ప్రైవేటు సంస్థల కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్.
  • పరిశ్రమలు, పారిశ్రామిక సంస్థల కార్యకలాపాలకు అనుమతి (ప్రభుత్వ/ప్రైవేటు).
  • నిర్మాణ రంగ పనులు కొనసాగించవచ్చు.
  • రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల మార్గదర్శకాలకు లోబడి అత్యవసర సేవల కోసం ప్రైవేటు వాహనాలను వినియోగించుకోవచ్చు. వైద్య, పశువైద్య, నిత్యావసరాల రవాణా, సేకరణ, నిర్దేశిత కేటగిరీల ఉద్యోగుల ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు.
  • కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయి.

  • Loading...

More Telugu News