Executive Order: డాక్టర్ల కోసమే... 120 ఏళ్ల నాటి ఎపిడెమిక్ చట్టానికి సవరణలు చేసిన కేంద్రం!

Amendments to Indian Epidemic Act

  • ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చట్ట సవరణ
  • రూ. 5 లక్షల వరకూ జరిమానా, ఏడేళ్ల వరకూ జైలుశిక్ష
  • హెల్త్ వర్కర్లపై దాడులను సహించబోమన్న కేంద్రం

కరోనా కట్టడికి ప్రాణాలను అడ్డుపెట్టి శ్రమిస్తున్న వైద్యులపై కొన్ని చోట్ల దాడులు జరగడాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం, 120 ఏళ్ల నాటి ఎపిడెమిక్ యాక్ట్ కు సవరణలు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశమైన కేంద్రం అత్యవసర ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను తీసుకువచ్చింది.

ఇక ఈ చట్ట సవరణలో భాగంగా వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే కఠినమైన శిక్షలుంటాయి. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టి, వెంటనే జైలుకు తరలిస్తారు. నేరం నిరూపితమైతే ఏడేళ్ల వరకూ జైలుశిక్ష, రూ. లక్ష నుంచి రూ. 7 లక్షల వరకూ జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

"దేశమంతా డాక్టర్లకు సెల్యూట్ చేస్తున్న వేళ, కొందరు మాత్రం వారి ద్వారా వైరస్ వ్యాపిస్తోందని ఆరోపిస్తూ దాడులకు దిగుతున్నారు. ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పౌర సమాజంలో ఇటువంటి దాడులకు స్థానంలేదు. అంత తీవ్రం కాని కేసుల్లో రూ. 50 వేల నుంచి 2 లక్షల జరిమానా, ఆరు నెలల నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, తీవ్ర గాయాలు చోటుచేసుకునే తీవ్రమైన కేసుల్లో రూ. 2 లక్షల నుంచి రూ. 7 లక్షల జరిమానా, ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు" అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు.

ఈ చట్టంతో డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు, అటెండర్లు తదితరాలకు రక్షణ కలుగుతుందని జవదేకర్ వ్యాఖ్యానించారు. హెల్త్ కేర్ నిపుణులకు బీమా కవరేజ్ ని కూడా విస్తరించినట్టు ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News