Revanth Reddy: ఏపీ ప్రభుత్వం జారీచేసిన 203 జీవోపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి: రేవంత్ రెడ్డి

Revanth Reddy demands Telangana government should respond on AP GO

  • ఏపీ ప్రభుత్వ జీవో 203పై తెలంగాణ కాంగ్రెస్ నేతల అసంతృప్తి
  • ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసిన రేవంత్ తదితరులు
  • తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల అంశం వివాదం రేకెత్తించింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోపై తెలంగాణ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంలో కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, ప్రసాద్ కుమార్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిని కలిశారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని అన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులకు నీళ్లిచ్చి ఆదుకోవాలని కోరారు. 

  • Loading...

More Telugu News