Krishna River Board: త్వరలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం

Krishna River Board will meet to discuss water issues between two states

  • తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం
  • పోతిరెడ్డిపాడుపై ఏపీ సర్కారు జీవో జారీ
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ

ఏపీ, తెలంగాణ మధ్య నదీ జలాల వ్యవహారంలో మరోసారి వివాదం రాజుకుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచేందుకు ఏపీ సర్కారు జీవో నెం.203 జారీ చేయడం తెలంగాణ వర్గాలను ఆగ్రహావేశాలకు గురిచేసింది. ఈ వ్యవహారంపై స్పందించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్వరలోనే కీలక సమావేశం నిర్వహించనుంది.

ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చడమే ఈ సమావేశం ప్రధాన అజెండా అని తెలుస్తోంది. ఈ సమావేశంలో... కృష్ణా నదిపై ఏపీ, తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్ పై చర్చ జరగనుంది. రెండో దశ టెలిమెట్రీ అమలు, ఇతర అంశాలపైనా చర్చించనున్నారు. ఈ మేరకు ప్రతిపాదిత అజెండాను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు పంపింది. ఇంకా ఏవైనా అంశాలు చర్చకు తీసుకురావాలని అనుకుంటే ఈ నెల 26 లోపు తమకు పంపించాలని బోర్డు కోరింది.

  • Loading...

More Telugu News