Nara Lokesh: వైఎస్ లేఖతో కియా వచ్చిందని చెప్పుకోవడం జగన్ పబ్లిసిటీ పిచ్చికి పరాకాష్ఠ: నారా లోకేశ్

Lokesh criticizes AP CM Jagan

  • మసిపూసి మారేడుకాయ చేయడంలో జగన్ దిట్ట అంటూ వ్యాఖ్యలు
  • జాతిపితకు కూడా రంగులు పూశారని ఎద్దేవా
  • జగన్ పెద్ద గుండు సున్నా అంటూ వ్యాఖ్యలు

ఏ విషయాన్నైనా మసి పూసి మారేడుకాయ అని చెప్పడంలో జగన్ దిట్ట అని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. కియా మోటార్స్ ఏపీకి వచ్చింది వైఎస్ లేఖ కారణంగానే అని చెప్పుకోవడం జగన్ పబ్లిసిటీ పిచ్చికి పరాకాష్ఠ అని విమర్శించారు.

జాతీయ జెండాను, జాతిపితను కూడా వదలకుండా రంగులు పూశారని, గుడి, బడి, శ్మశానం కాదేదీ వైసీపీ రంగుకు అనర్హం అంటూ రూ.3 వేల కోట్ల ప్రజాధనాన్ని రంగులపాలు చేశారని మండిపడ్డారు. సున్నా వడ్డీ అంటూ ఉన్న పథకానికే మళ్లీ రిబ్బిన్ కట్ చేసి జగన్ పెద్ద గుండు సున్నా అని నిరూపించుకున్నారని, ఏడాదిలో పాలన చేతగాక పాతవాటికి రంగులు వేసి సరిపెట్టారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News