KTR: నాపై తప్పుడు ప్రచారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటా: కేటీఆర్

KTR response on Green Tribunal notice regarding farm house

  • కేటీఆర్ ఫాంహౌస్ పై ఫిర్యాదు
  • నోటీసు ఇచ్చిన గ్రీన్ ట్రైబ్యునల్
  • ఆ భూమి తనది కాదన్న కేటీఆర్

గండిపేట చెరువుకు ఎగువన ఉన్న జన్వాడ గ్రామంలో జీవో 111 నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్ ను నిర్మించారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ పై జాతీయ హరిత ట్రైబ్యునల్ లో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ కు గ్రీన్ ట్రైబ్యునల్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై కేటీఆర్ స్పందించారు.

ఒక కాంగ్రెస్ నేత తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఆ భూమి తనది కాదని గతంలోనే స్పష్టంగా చెప్పానని అన్నారు. తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటానని  చెప్పారు. తనపై వచ్చినవన్నీ అసత్య ఆరోపణలని నిరూపిస్తానని అన్నారు.

  • Loading...

More Telugu News