Andhra Pradesh: ఏపీలో 5 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు... తాజాగా ఇద్దరి మృతి

AP crosses five thousand mark in corona positive cases

  • గత 24 గంటల్లో 246 మందికి కరోనా పాజిటివ్
  • తాజాగా 47 మంది డిశ్చార్జి
  • 2,231 మందికి కొనసాగుతున్న చికిత్స

ఏపీలో గడచిన 24 గంటల్లో 15,173 నమూనాలు పరీక్షించగా 246 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5 వేలు దాటింది. ఇప్పటివరకు 5087 మందికి కరోనా నిర్ధారణ అయింది. తాజాగా  47 మందిని డిశ్చార్జి చేశారు. దాంతో, ఇప్పటిదాకా 2,770 మంది డిశ్చార్జి కాగా, 2,231 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా మరో రెండు మరణాలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో ఒకరు మృత్యువాత పడగా మరణాల సంఖ్య 86కి పెరిగింది.

  • Loading...

More Telugu News