AP High Court: గుండెపోటుతో మృతి చెందిన ఏపీ హైకోర్టు ఇన్చార్జి రిజిస్ట్రార్ జనరల్

AP High Court registrar general died of heart attack

  • విధుల్లో ఉండగా గుండెపోటుకు గురైన రాజశేఖర్
  • హుటాహుటిన విజయవాడలోని ఆసుపత్రికి తరలింపు
  • చికిత్స పొందుతూ మృతి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ గుండెపోటుతో మరణించారు. హైకోర్టులో విధుల్లో ఉండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

రిజిస్ట్రార్ జనరల్ గా నిన్ననే ఓ మహిళాధికారిని నియమించారు. ఈ నెల 30లోపు ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.  ప్రస్తుతం రాజశేఖర్ ఇన్చార్జి రిజిస్ట్రార్ జనరల్  గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన మరణంతో హైకోర్టు ప్రాంగణం విషాదంలో మునిగిపోయింది.

  • Loading...

More Telugu News