Tirupati: తిరుపతిలో ఓ ఇంటిలో చోరీ.. రూ.14 లక్షల సొత్తు అపహరణ

Thieves in Tirupati robbed 14 lakh

  • గాయత్రినగర్‌లోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు
  • రూ. 10.70 లక్షల విలువైన బంగారం, రూ. 3.75 లక్షల నగదు చోరీ
  • మధ్యాహ్నం వరకు గుర్తించలేకపోయిన యజమాని

తిరుపతిలోని గాయత్రినగర్‌లో భారీ చోరీ జరిగింది. తలుపులు తొలగించి ఇంట్లోకి చొరబడిన ముఠా రూ.10.70 లక్షల విలువైన బంగారం, రూ.3.75 లక్షల నగదును దోచుకుంది. చోరీ జరిగినట్టు సాయంత్రం వరకు యజమాని గుర్తించకపోవడం గమనార్హం. ఆ తర్వాత తెలుసుకుని లబోదిబోమన్నాడు. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.

  • Loading...

More Telugu News