Railway Line: నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గంలో మరింత పురోగతి... పూర్తయిన పిడుగురాళ్ల-శావల్యాపురం రైల్వే లైన్

New railway line between Piduguralla and Savalyapuram has completed

  • 46 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం
  • ఇక రైళ్లు నడుస్తాయన్న మేకపాటి గౌతమ్ రెడ్డి
  • కేంద్రం, రాష్ట్రం 50:50 నిష్పత్తిలో వ్యయాన్ని భరిస్తాయని వెల్లడి

వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణ దూరం తగ్గించడంతో పాటు, అనేక ప్రాంతాలకు రైల్వే సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా కేంద్రం కొత్త రూట్లలో రైల్వే లైన్లు నిర్మిస్తోంది. ఇలాంటి మార్గాల్లో నడికుడి-శ్రీకాళహస్తి మార్గం ఒకటి. తాజాగా ఈ రూట్లో పిడుగురాళ్ల-శావల్యాపురం మధ్య 46 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైను నిర్మాణం పూర్తయిందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఇకపై ఈ ట్రాక్ లో రైళ్లు నడుస్తాయని తెలిపారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను ప్రాజెక్టులో భాగంగా ఈ కొత్త ట్రాక్ నిర్మించడం జరిగిందని వివరించారు. దీని వ్యయాన్ని కేంద్రం, రాష్ట్రం 50:50 నిష్పత్తిలో భరిస్తాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News