Innovation Challenge: చైనా యాప్ లకు దీటుగా దేశీయ యాప్ ల రూపకల్పన కోసం ఇన్నొవేషన్ చాలెంజ్ ప్రకటించిన కేంద్రం

Centre announces innovation challenge to make and develop new apps

  • సరికొత్త ఆవిష్కరణలకు ఆహ్వానం
  • దేశీయ అవసరాలకు తగిన యాప్ లకు బహుమతులు
  • జూలై 18 తుదిగడువు

చైనాతో సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో భారత్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే చైనాకు చెందిన 59 యాప్ లను నిషేధించింది. తాజాగా, ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా దేశీయంగా యాప్ ల రూపకల్పన, అభివృద్ధి అంశాల్లో ఇన్నొవేషన్ చాలెంజ్ ప్రకటించింది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ట్రాక్-1, ట్రాక్-2 అంటూ విభజించారు.

ఇప్పటికే దేశీయంగా వాడుకలో ఉన్న యాప్ ల కోసం ట్రాక్-1, దేశంలో కొత్త యాప్ లు రూపొందించగల సత్తా ఉన్న ఔత్సాహికుల కోసం ట్రాక్-2 చాలెంజ్ ను ప్రకటించారు. వర్క్ ఫ్రమ్ హోమ్, సోషల్ మీడియా, ఈ-లెర్నింగ్, క్రీడలు, వార్తలు, ఆర్థిక సాంకేతికత, అగ్రిటెక్, హెల్త్, వినోదం, ఆఫీస్ ప్రొడక్టివిటి అంశాల్లో యాప్ లు రూపొందించాల్సి ఉంటుంది.

ట్రాక్-1, ట్రాక్-2 రెండు విభాగాల్లో మూడేసి బహుమతులు ఇవ్వనున్నారు. ఫస్ట్ ప్రైజ్ రూ.20 లక్షలు, సెకండ్ ప్రైజ్ రూ.15 లక్షలు, మూడో బహుమతి రూ.10 లక్షలు ఇవ్వనున్నారు. ఇతర విభాగాల్లోనూ మరికొన్ని బహుమతులు ఉన్నాయి. నీతి ఆయోగ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ ఈ ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నొవేషన్ చాలెంజ్ ను నిర్వహిస్తున్నాయి. జూలై 4 నుంచి చాలెంజ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 18 లోపు ఆన్ లైన్ లో వివరాలు సమర్పించాలి.

  • Loading...

More Telugu News