NGT: పరవాడ గ్యాస్ లీక్ ఘటనపై నేడు గ్రీన్ ట్రైబ్యునల్‌లో విచారణ

Green Tribunal inquiry into Paravada gas leak incident today

  • గత నెల 30న సాయినార్ లైఫ్ సైన్సెస్‌లో గ్యాస్ లీక్
  • ఇద్దరు ఉద్యోగులు మృతి, నలుగురికి గాయాలు
  • సుమోటోగా స్వీకరించి విచారణ ప్రారంభించిన ఎన్‌జీటీ

జూన్ 30న పరవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్‌లో జరిగిన గ్యాస్‌లీక్ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును సుమోటోగా స్వీకరించిన ఎన్‌జీటీ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. తాజాగా, నేడు ఈ కేసును విచారించనుంది. మరోవైపు,  సాయినార్ లైఫ్ సైన్సెస్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News