Jagan: నాన్న గారు మరణం లేని మహానేత: ఇడుపులపాయ నుంచి జగన్ ట్వీట్

CM Jagan paid tributes to his father YSR

  • నేడు వైఎస్సార్ 71వ జయంతి
  • ఆయన ఎప్పటికీ చిరంజీవేనంటూ జగన్ స్పందన
  • రైతు పక్షపాతి అంటూ వ్యాఖ్యలు

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని సీఎం జగన్ ఇడుపులపాయలో ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఇడుపులపాయ నుంచి ట్వీట్ చేశారు. ఇవాళ నాన్న గారి 71వ జయంతి... ఆయన మరణంలేని మహానేత అంటూ కీర్తించారు. ఆరోగ్య శ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవిలా నిలిచిపోతారని కొనియాడారు. రైతు పక్షపాతి అయిన మహానేత జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు.

ఇడుపులపాయ వచ్చిన సందర్భంగా సీఎం జగన్ ఇక్కడి ట్రిపుల్ ఐటీ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ క్లాస్ రూములను, విద్యుత్ వ్యయాన్ని తగ్గించడం కోసం ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ శిలాఫలకాలను కూడా ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News