Bharat Biotech: కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ పై భారత్ బయోటెక్ ప్రకటన

Bharat Biotech announces that they launched clinical trials across the country

  • ఈ నెల 15న తొలి దశ ప్రారంభించినట్టు వెల్లడి
  • 375 మందిపై ప్రయోగాలు
  • దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్

భారత్ లో కరోనా వ్యాక్సిన్ పరిశోధనలు మరింత ఊపందుకున్నాయి. కోవాగ్జిన్ పేరిట కరోనాకు వ్యాక్సిన్ రూపొందిస్తున్న భారత్ బయోటెక్ సంస్థ దీనిపై తాజాగా ప్రకటన చేసింది. ఈ నెల 15న కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ మొదటి దశ ప్రారంభించామని వెల్లడించింది. ఈ మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ లో 375 మంది పాలుపంచుకుంటున్నట్టు వివరించింది. దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ షురూ అయ్యాయని భారత్ బయోటెక్ పేర్కొంది. ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించింది. దేశీయంగా తయారవుతున్న వ్యాక్సిన్ గా కొవాగ్జిన్ కు ఎంతో గుర్తింపు లభిస్తోంది. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దశను విజయవంతంగా పూర్తిచేసుకుంటే వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. భారత్ బయోటెక్ హైదరాబాద్ కు చెందిన సంస్థ అని తెలిసిందే.

  • Loading...

More Telugu News