Ayodhya Ram Mandir: 175 మంది ప్రముఖులు, 135 మంది సాధువులకు అయోధ్య భూమి పూజకు ఆహ్వానం

All set for Ram Mandir Bhumi Poojan in Ayodhya

  • ఆగస్టు 5న రామ మందిరం భూమి పూజ
  • హాజరుకానున్న ప్రధాని మోదీ
  • పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, నదుల నుంచి నీరు సేకరణ

అయోధ్యలో రామ మందిరం నిర్మాణ బాధ్యతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్లుండి అయోధ్యలో రామ మందిరం భూమి పూజ జరగనుండగా, ఈ కార్యక్రమంలో పాల్గొనే అతిథులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. ఈ చారిత్రాత్మక భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంది బెన్ పటేల్, రామ జన్మభూమి న్యాస్ అధిపతి నృత్యగోపాల్ దాస్ ఈ క్రతువులో ప్రధాని మోదీతో కలిసి వేదికపై ఆసీనులు కానున్నారు.

మొత్తమ్మీద ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి 175 మంది ప్రముఖులను, 135 మంది సాధువులను ఆహ్వానించినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. కాగా, ఈ భూమి పూజ కోసం దేశంలోని వేలాది పుణ్యక్షేత్రాల నుంచి పవిత్రమైన మట్టిని, వంద నదుల నుంచి పుణ్యజలాలను సేకరించినట్టు వివరించింది.

  • Loading...

More Telugu News