Suresh Kumar: ఎస్వీబీసీ చానల్ సీఈఓగా సురేశ్ కుమార్ నియామకం

Government appoints Suresh Kumar as SVBC CEO

  • ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
  • దూరదర్శన్ కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న సురేశ్ కుమార్
  • కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్ర సర్వీసుల్లోకి రాక

టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) సీఈఓగా జి.సురేశ్ కుమార్ ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సురేశ్ కుమార్ ప్రస్తుతం విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్ పై ఆయన రాష్ట్ర సర్వీసుల్లో చేరారు. త్వరలోనే ఎస్వీబీసీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

  • Loading...

More Telugu News