Jagan: ఒక్కో జిల్లాలో ఒక్కో మంత్రి జాతీయ పతాకావిష్కరణ... కృష్ణా జిల్లాలో పతాకావిష్కరణ చేయనున్న సీఎం జగన్

CM Jagan will flag hoisting in Krishna district on Independence day

  • ఎల్లుండి స్వాతంత్ర్య దినోత్సవం
  • గౌరవ వందనం స్వీకరించే మంత్రుల జాబితా ఖరారు
  • ఉత్తర్వులు జారీచేసిన సాధారణ పరిపాలన విభాగం

ఎల్లుండి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు 13 జిల్లాల్లో గౌరవవందనం స్వీకరించే ఉపముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సాధారణ పరిపాలన విభాగం జారీ చేసింది.

  • Loading...

More Telugu News