Tirumala: తిరుమలలో పరకామణి భవన నిర్మాణానికి భూమి పూజ

TTD built new Parakamani Bhavan In Tirumala

  • రూ. 9 కోట్లతో నూతన భవన నిర్మాణం
  • భూమి పూజ చేసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
  • పూర్తి హంగులతో భవన నిర్మాణం

తిరుమలలో పరకామణి నిర్వహిస్తున్న ప్రస్తుత ప్రాంగణంలో సరైన వసతులు లేకపోవడంతో నూతన భవన నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్ధమైంది. సిబ్బంది ఇబ్బందులు తీర్చే ఉద్దేశంతో ఆలయానికి సమీపంలో రూ. 9 కోట్లతో అన్ని హంగులతో కొత్త భవనాన్ని నిర్మించాలని పాలక మండలి నిర్ణయించింది. ఇందులో సిబ్బంది కోసం ప్రత్యేకంగా విశ్రాంతి గదులు, స్ట్రాంగ్ రూమ్, డొనేషన్ల కౌంటర్, బ్యాంకు కౌంటర్లు తదితర వాటిని ఏర్పాటు చేయనున్నారు. నూతన భవనానికి ఈ ఉదయం టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భూమి పూజ చేశారు.

  • Loading...

More Telugu News