Cabinet: ఇక ప్రధాని పర్యవేక్షణలో సివిల్ సర్వీసెస్: కేంద్ర మంత్రి జవదేకర్

Union cabinet approves key decisions

  • కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
  • సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలు
  • జమ్మూ కశ్మీర్ లో ఐదు భాషలకు ఆమోదం

ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రధానమంత్రి పర్యవేక్షణలో సివిల్ సర్వీసెస్ నిర్వహించనున్నారు. ఈ మేరకు సివిల్ సర్వీసెస్ ఉద్యోగ నియామక సంస్కరణల కోసం తీసుకువచ్చిన 'మిషన్ కర్మయోగి' కార్యాచరణకు కేబినెట్ సమ్మతి తెలిపినట్టు జవదేకర్ పేర్కొన్నారు.

అంతేకాదు, జమ్మూ కశ్మీర్ లో 5 అధికార భాషలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కశ్మీరీ, ఉర్దూ, డోగ్రీ, హిందీ, ఇంగ్లీషు గుర్తింపు పొందనున్నాయి. వీటికి సంబంధించి పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. 3 కీలక ఎంవోయూలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News