Telangana: టీఎస్ అసెంబ్లీ ఉద్యోగికి కరోనా.. కలకలం!

TS Assembly employee tests with Corona positive

  • నిన్న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
  • నిన్న విధులు నిర్వహించిన ఉద్యోగికి కరోనా పాజిటివ్
  • ఆందోళనలో ఇతర ఉద్యోగులు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. సమావేశాల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా నెగెటివ్ ఉన్న వారిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ టెస్టులు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో అసెంబ్లీలో పని చేస్తున్న ఒక ఉద్యోగికి ఈరోజు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ ఉద్యోగి నిన్న కూడా అసెంబ్లీలో విధులు నిర్వహించారు. దీంతో, అక్కడ పని చేస్తున్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగికి కరోనా అని తేలడంతో ఆయనతో ఎవరెవరు కాంటాక్ట్ లోకి వచ్చారనే విషయంపై అధికారులు దృష్టి సారించారు.

  • Loading...

More Telugu News