Nizamabad District: రెండు బైకులు ఢీ...నిండు గర్భిణి దుర్మరణం!

Pregnent Lady Died in Road Accident

  • నిజామాబాద్ జిల్లాలో ఘటన
  • సోదరుడితో కలిసి ఆసుపత్రికి వెళుతున్న రజిత
  • మరో బైక్ ఢీకొనడంతో ప్రమాదం

వేగంగా వెళుతున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో నిండు గర్భిణి దుర్మరణం చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తీర్మనపల్లి వద్ద జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, 8 నెలల గర్భంతో ఉన్న రజిత అనే మహిళ, తన సోదరుడితో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి వెళుతుండగా, ఈ ఘటన జరిగింది. ఎదురుగా వస్తున్న మరో బైక్ రజిత ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకులు నడుపుతున్న ఇద్దరు యువకులకు గాయాలు అయ్యాయి. రజిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, గాయపడిన ఇద్దరికీ చికిత్స జరుగుతోందని, కేసును విచారిస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. 

  • Loading...

More Telugu News