Janasena: హత్రాస్ కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా సరైన నిర్ణయం తీసుకున్నారు: జనసేన

Janasena welcomes Yogi Adithyanath decision of handing Hathras case to CBI

  • నాదెండ్ల మనోహర్ నుంచి ప్రకటన
  • దోషులకు శిక్ష పడుతుందన్న నమ్మకం ఉందని వెల్లడి
  • అందరూ గళం విప్పాలని పిలుపు

ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో19 ఏళ్ల అమ్మాయిపై పైశాచిక దాడి కేసును యోగి ఆదిత్యనాథ్ సర్కారు సీబీఐకి అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ స్వాగతించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా సీఎం యోగి ఆదిత్యనాథ్ సరైన నిర్ణయం తీసుకున్నారని ఓ ప్రకటనలో అభిప్రాయపడింది. ఈ కేసులో సీబీఐ విచారణ ద్వారా దోషులకు శిక్ష పడుతుందని జనసేన నమ్ముతోందని ఆ ప్రకటనలో పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

అత్యాచార ఘటనలు జరిగినప్పుడు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ గళం విప్పాలని జనసేన ఆది నుంచి కోరుకుంటోందని తెలిపారు. అమ్మాయిల భద్రతకు ఈ సమాజం భరోసా ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఏపీలోని కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి అనే బాలిక వ్యవహారంలో జనసేన ఇదే తరహాలో పోరాడుతోందని వివరించారు.

నాడు కర్నూలులో జనసేనాని పవన్ కల్యాణ్ కవాతు చేయడంతో ప్రభుత్వం ఆ కేసును సీబీఐకి అప్పగించిందని, అయితే ఇంతవరకు సీబీఐ నుంచి ఈ కేసుపై అధికారిక ప్రకటన లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News