Satyavathi Rathod: ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి సమాజంలో బతకడానికి చోటులేదు: దీక్షిత్ హత్యపై మంత్రి సత్యవతి

satyavati fires on sagar

  • దీక్షిత్‌రెడ్డి  కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి
  • నిందితుడిని కఠినంగా శిక్షించాలని వ్యాఖ్య
  • తమ సర్కారు అండగా ఉంటుందని హామీ  

మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో అపహరణకు గురైన దీక్షిత్ రెడ్డి (9)ని కిడ్నాపర్లు హత్య చేసిన విషయం తెలిసిందే. మెకానిక్ మందసాగర్ అనే వ్యక్తి బాలుడిని హత్య చేశాడని పోలీసులు ఇప్పటికే తేల్చారు. ఈ బాలుడి కిడ్నాప్, హత్యను తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి దారుణాలకు పాల్పడే వారికి సమాజంలో బతకడానికి చోటులేదని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని అన్నారు.

దీక్షిత్‌రెడ్డి  కుటుంబాన్ని సత్యవతి రాథోడ్ ఈ రోజు‌ పరామర్శించారు. శనిగపురం వెళ్లిన ఆమె బాలుడి తల్లిదండ్రులు రంజిత్‌రెడ్డి, వసంతతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని చెప్పారు. వారికి తమ సర్కారు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిందితులు సాంకేతికతను వినియోగించుకుని ఇటువంటి ఘటనలకు పాల్పడడానికి ప్రయత్నం చేయడం విచారకరమని తెలిపారు.

  • Loading...

More Telugu News