Gitam university: గీతం యూనివర్శిటీ కట్టడాల కూల్చివేతపై నవంబర్ 30వరకు స్టే

AP High Court Stay on GITAM University Wall Demolish

  • నిన్న తెల్లవారుజామున కూల్చివేతలు చేపట్టిన అధికారులు.
  • నోటీసులు కూడా ఇవ్వలేదని హైకోర్టును ఆశ్రయించిన గీతం యాజమాన్యం
  • కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

గీతం యూనివర్శిటీకి సంబంధించి కట్టడాల కూల్చివేతలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. నవంబర్ 30వ తేదీ వరకు తదుపరి చర్యలను తీసుకోవద్దని ఆదేశించింది. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

విశాఖలోని  గీతం విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని కొన్ని కట్టడాలను నిన్న జీవీఎంసీ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. నిన్న తెల్లవారుజాము నుంచే పొక్లెయిన్ లతో కూల్చివేయడం ప్రారంభించారు. ఈ సందర్భంగా 100 మందికి  పైగా పోలీసులు మోహరించారు. ఆర్డీవో పెంచలయ్య ఆధ్వర్యంలో దాదాపు 40 మంది రెవెన్యూ సిబ్బంది ఈ కూల్చివేత కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయితే నోటీసులు కూడా ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారంటూ గీతం యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 30 వరకు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News