EAMCET: తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ఆపాలని జేఎన్టీయూని ఆదేశించిన హైకోర్టు

TS HC orders JNTU to stop EAMCET councelling
  • కరోనా నేపథ్యంలో విద్యార్థులకు 35 కనీస మార్కులు వేసిన వైనం
  • నిబంధనల ప్రకారం ఎంసెట్ కు 45 శాతం మార్కులు ఉండాలి
  • దీంతో అర్హతను కోల్పోయిన ఎందరో విద్యార్థులు
తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ కి హైకోర్టు బ్రేక్ వేసింది. రెండో విడత కౌన్సిలింగ్ ను ఆపాలని జేఎన్టీయూని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షలు జరగని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులకు కనీస మార్కులు 35 వేసి తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసింది. అయితే ఎంసెట్ నిబంధనల ప్రకారం వార్షిక పరీక్షల్లో 45 శాతం మార్కులు కచ్చితంగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఎందరో విద్యార్థులు ఎంసెట్ కు అర్హతను కోల్పోయారు.

దీంతో, విద్యార్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను ఈరోజు విచారించిన హైకోర్టు ప్రభుత్వం తరపు వాదనలను కూడా వినింది. ఈ సందర్భంగా, ఎంసెట్ నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో, ప్రభుత్వం జీవో జారీ చేసేంత వరకు కౌన్సిలింగ్ ని ఆపేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
EAMCET
Telangana
TS High Court
Councelling

More Telugu News