Pawan Kalyan: రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కల్యాణ్... స్వాగతం పలికిన ముఖ్యనేతలు

Pawan Kalyan arrives Renigunta airport

  • చిత్తూరు, నెల్లూరు జిల్లాల పర్యటనకు వచ్చిన పవన్
  • ఈ సాయంత్రం తిరుపతిలో మీడియా సమావేశం
  • అనంతరం కార్యకర్తలతో భేటీ

నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న జిల్లాల్లో పర్యటిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ కొద్దిసేపటి కిందట రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ ఆయనకు జనసేన పార్టీ ముఖ్యనేతలు స్వాగతం పలికారు. పవన్ డిసెంబరు 3, 4, 5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.

ఈ నేపథ్యంలో రేణిగుంట వచ్చిన ఆయన కరకంబాడి మీదుగా తిరుపతి బయల్దేరారు. తిరుపతిలో సాయంత్రం 4 గంటలకు పవన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 5 గంటలకు జనసేన కార్యకర్తల భేటీలో పొల్గొంటారు. ఇటీవల నివర్ తుపానుతో ఏపీలోని అత్యధిక జిల్లాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల కష్టాలను తెలుసుకోవాలని పవన్ రంగంలోకి దిగారు.

  • Loading...

More Telugu News