Telangana: కరోనా టీకాను తొలుత ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు తీసుకోవాలి: పొన్నాల

Ponnala Lakshmaiah on corona vaccine

  • ప్రభుత్వాలు ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాయి
  • టీకాపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి
  • ఇతర దేశాల్లో అదే జరుగుతోంది

కరోనా వైరస్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ప్రజలకు భరోసా ఇవ్వడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత నిన్న హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

కరోనా టీకా త్వరలోనే అందుబాటులోకి రానున్న నేపథ్యంలో దానిని తొలుత ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు వేసుకోవాలని కోరారు. ఇతర దేశాల్లో అయితే ఆయా దేశాధి నేతలే తొలుత వ్యాక్సిన్ తీసుకుని ప్రజల్లో టీకాపై విశ్వాసం పెంచుతున్నారని, మన దగ్గర కూడా అలానే జరగాలని పొన్నాల కోరారు.

  • Loading...

More Telugu News