shivraj singh chouhan: నేనైతే ఇప్పుడు టీకా తీసుకోలేను: స్పష్టం చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

will not get vaccinated first says Shivraj Singh Chouhan

  • కరోనా టీకా అత్యవసర వినియోగానికి అనుమతి
  • ప్రాధాన్య క్రమంలో ఉన్న వారికే తొలుత టీకా వేస్తామన్న సీఎం
  • వ్యాక్సినేషన్ కార్యక్రమంపై రాష్ట్రాల దృష్టి

తానైతే ప్రస్తుతానికి టీకా వేయించుకోవాలని అనుకోవడం లేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. తొలుత ప్రాధాన్య క్రమంలో ఉన్న వారికే  టీకా వేస్తామని, ఆ తర్వాతే తన వంతు అని పేర్కొన్నారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రాధాన్యత క్రమంలో ఉన్న వారికే తొలుత టీకా ఇస్తామని పునరుద్ఘాటించారు. అందుకోసమే తాము పనిచేయాలని అన్నారు. కాగా, కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో శివరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మిగతా రాష్ట్రాలు కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై దృష్టిసారించాయి. ఇందుకోసం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News